*
ఏప్రిల్లోగా 8539 పోస్టుల భర్తీ
* పారదర్శకంగా నియామకాలు
* దళారుల్ని నమ్మి మోసపోవద్దు
*అభ్యర్థులకు విద్యుత్ శాఖ అధికారుల
విజ్ఞప్తి
హైదరాబాద్: నిరుద్యోగులకు ఉద్యోగాల పంట పండనుంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్థల్లో 8,539 పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏప్రిల్ ఆఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు సంస్థలను ఆదేశించింది. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, సీపీడీసీఎల్, ఎన్పీసీడీఎల్, ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ పరిధిలో 6263 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబరులోనే ప్రభుత్వం అనుమతించింది.
|