2011లో ఐఐటీ - జేఈఈలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన పృధ్వీతేజ్ను తన విజయానికి ఇన్స్పిరేషన్ అని అతని లాగే జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాలనే లక్ష్యంతో చదివానని చెప్పాడు. సందీప్ ఐఐటీ-జేఈఈ - 2012లో ఆలిండియా 1021వ ర్యాంకు సాధించాడు. ఇప్పుడు ఏఐఈఈఈలో బి.టెక్ ఆలిండియా ఓపెన్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు.
ఆ వృత్తిలో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్యసేవలందిస్తూ వారి జీవన స్థితిగతులు చూసి మళ్లీ మనసు చలించింది. వీరి జీవన స్థితిగతుల్లో మార్పులు తేవాలి అని భావించాను. అందుకు సివిల్స్ అనే దారి కనిపించింది. మూడుసార్లు అపజయాలే. అయినా గురి తప్పలేదు. నాలుగోసారి ప్రయత్నించి సివిల్స్ 252 ర్యాంకు సాధించా. ఆ ర్యాంకుతో ఐపీఎస్కు ఎంపిక కావాల్సి ఉంది. కానీ ఎత్తు కాస్త తక్కువని ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీసు)కు ఎంపిక చేశారు. ఇక్కడ చదువులు చదివి విదేశాల్లో సేవలందించటం నాకు ఇష్టంలేదు. మాతృగడ్డకు నా సేవలందాలనే పట్టుదలతో ఆ సర్వీసును త్యజించా. మళ్లీ ప్రయత్నించి సివిల్స్ సర్వీసులో జాతీయ స్థాయిలో 20వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకును సొంతం చేసుకున్నా. రెండుసార్లు ప్రయత్నంలో విఫలం అయ్యా. మూడోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి మళ్లీ తప్పా. దాంతో ఇక అపేద్దాం అనిపించింది. ఒక వైపు భయంవేసింది. అయినా ఎక్కడో ఆశ. ఇంతకాలం పడిన శ్రమ ఊరికేపోతుందని మళ్లీ ప్రయత్నించా. విజయం సాధించా. అయితే వచ్చిన సర్వీసుతో సొంత దేశంలో పనిచేయాలనే కోరిక తీరకుండా పోతుందని దాన్ని వదిలేసుకుని మళ్లీ ప్రయత్నించి సఫలీకృతుడినయ్యా.
రోజుకు 8 గంటలు చదివా. ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. నా మిత్రులు ఐపీఎస్ అధికారి బాబుజి, ఐఏఎస్ అధికారి కిరణ్ మార్గదర్శకత్వం అందించారు. కష్టపడితే ఫలితం ఊరికేపోదు అనేదానికి నా విజయమే ఉదాహరణ. ప్రణాళిక ప్రకారం చదవాలి. నా విజయం అమ్మనాన్నలకే అంకితం. నాకు చదవుకునే సమయంలో బాలవికాస్ పాఠశాల కరస్పాండెంటు, మా మామగారు అయిన సుబ్బరాయుడు, అత్త దేవి, మామయ్య గంగయ్య సహకారం మరవలేనిది. ప్రజల జీవన విధానాల్లో నాణ్యతను తీసుకురావాలన్నదే నా సంకల్పం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కాగా పేదలకు అందేలా చూస్తా. పేదప్రజలకు సేవలందించటమే నా లక్ష్యం".
53వ ర్యాంకు సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. రాష్ట్ర స్థాయిలో మూడో స్థానాన్ని ఆక్రమించారు. నిర్దేశించుకున్న లక్ష్యసాధనకు ఆయన ఎలా శ్రమించారో ఆయనమాటల్లోనే.. ''బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు మా స్వగ్రామం. సాధారణ రైతు ఆదినారాయణ, జానకిలకు నేను మూడో సంతానం. అన్న ఉదయ్కుమార్, అక్క స్వప్న. ఇంటర్మీడియట్ వడ్లమూడి విజ్ఞాన్లో పూర్తి చేశాను. 2003-2005 మధ్య బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేశా. 2007లో హైదరాబాద్ ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రవేశం. 2009 దాకా అక్కడే ఉద్యోగం. ఆ తర్వాత ఓ ఆరు మాసాలు బళ్లారిలో జేఎస్డబ్ల్యూలో పని చేశా. సంపూర్ణంగా ప్రజాసేవ చేయాలంటే సివిల్స్లోకి ప్రవేశించాలన్న పట్టుదలతో 2009 తర్వాత న్యూఢిల్లీకి మకాం మార్చాను. రెండేళ్లపాటు అక్కడే కఠోరంగా తర్ఫీదు పొందారు. గతేడాది నవంబరు దాకా అక్కడే ఉన్నా. ఇక మౌఖిక పరీక్ష మాత్రమే మిగిలి ఉంది. దీని కోసం హైదరాబాద్లో ఉన్న విశ్రాంత ఐఎఎస్ గోపాల్కృష్ణ వద్ద శిష్యురికం చేశా. రెండు నెలలపాటు పలు అంశాలపై మెళకువలు నేర్చుకున్నాను. గుండె నిండా నింపుకున్న మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో మౌఖిక పరీక్షను ఎదుర్కొన్నాను. ఎంతో ఓపిక, సహనంతో సమాధానాలు చెప్పాను. సమాజసేవకే.. శ్వేత, 163వ ర్యాంక్ (మహబూబ్నగర్జిల్లా) ''సమాజసేవ చేసేందుకు ఈ రంగమే సరైందనే నమ్మకంతో సివిల్స్కు చదివాను. భర్త సుమన్ ప్రోత్సాహంతోనే సాధించగలిగాను". అపజయాలే సోపానాలు * శీరం సాంబశివరావు, 164వ ర్యాంక్ (విజయవాడ) '' గతంలో మూడుసార్లు విఫలమైనా నిరాశ చెందలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదలుకుని ఏకాగ్రత, పట్టుదలతో చదివి సివిల్స్లో విజయం సాధించా. నాలుగో ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించగలిగాను". ఉమేష్చంద్ర స్ఫూర్తితో.. మహేశ్వర్రెడ్డి, 196వ ర్యాంక్ (కడపజిల్లా) ''దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్చంద్ర నాకు స్ఫూర్తి. పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగం విన్నాక ఆయనలా ఐపీఎస్ కావాలని నిర్ణయించుకున్నా. రెండు సార్లు ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా విజయం సాధించలేదు. గత ఫలితాల్లో 512వ ర్యాంకు రావడంతో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వచ్చింది. అందులో చేరకుండా మళ్లీ చదివి 196వ ర్యాంక్ సాధించా. |
|
APPSC GROUP - II
|
బండారుపల్లి గ్రామానికి చెందిన రైతు బసవపున్నారావు, అచ్చమాంబ దంపతులకు వెంకటేశ్వరరావు రెండో సంతానం. పాఠశాల చదువంతా గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలోనే సాగింది. పదో తరగతిలో 440 మార్కులు సాధించారు. తల్లిదండ్రులు, గురువుల సూచన మేరకు బైపీసీలో చేరారు. ఇంటర్ ఫలితాల్లో 70 శాతం మార్కులు సాధించారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఎంసెట్ రాయగా 2 వేల ర్యాంకు రాగా బీఫార్మసీలో సీటొచ్చొంది. పేరేచర్లలోని ప్రైవేటు ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేశారు. ఫార్మసీ విద్యలోనే పీజీ చేయాలని జాతీయ స్థాయి పోటీ పరీక్ష గేట్కు హాజరైనా ర్యాంకు రాలేదు. దీంతో పోటీ పరీక్షలకు హాజరై రెవెన్యూ శాఖలో ఉద్యోగాన్ని పొందాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. గ్రూపు-2లో రాష్ట్ర స్థాయిలో ప్రథముడిగా నిలిచి స్వగ్రామానికి గుర్తింపు తీసుకువచ్చారు. మూడేళ్ల కష్టానికి ప్రతిఫలం: బీఫార్మసీ పూర్తయ్యాక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో ఏపీపీఎస్సీ 2004లో గ్రూప్-2 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆ ఏడాది గ్రూప్-2కు హాజరైన వెంకటేశ్వరరావుకు విజయం వరించినా రెవెన్యూ శాఖలో ఉద్యోగం లభించలేదు. అప్పట్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కలిపి మొత్తం 369 (500) మార్కులు రావటంతో దేవాదాయశాఖలో ఈఓగా ఉద్యోగం వచ్చింది. ఒంగోలులోని చెన్నకేశవస్వామి ఆలయం, ప్రత్తిపాడు గ్రూపు దేవస్థానాలకు ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వోద్యోగం చేస్తున్నా నిర్దేశించుకున్న లక్ష్యం మాత్రం నిద్ర పట్టనివ్వలేదు. 2008లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి మళ్లీ గ్రూప్-2 పరీక్షకు సిద్ధమయ్యారు. నగరంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ, ప్రాంతీయ గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న పుస్తకాలతో కుస్తీ పట్టారు. రోజూ గ్రంథాలయాలకు రావటం 4 నుంచి 5 గంటలపాటు చదవటం చేశారు. 2008లో నోటిఫికేషన్ విడుదలైనా పరీక్ష మాత్రం 2011 అక్టోబరులో జరిగింది. ఈ మధ్యకాలం మూడేళ్లపాటు అందుబాటులో ఉన్న ప్రతి పుస్తకాన్ని ఆయన చదివారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికిపైగా పోటీపడిన గ్రూప్-2 రాత పరీక్షను దిగ్విజియంగా పూర్తి చేశాడు. రాతపరీక్ష ద్వారా ఇంటర్వ్యూకు ఎంపికైన 1,204 మందిలో ఒకరుగా నిలిచారు. మార్చి 22న నలుగురు అధికారుల బృందం నిర్వహించిన ఇంటర్వ్యూలో సమాధానాలు చకాచకా చెప్పారు. ఈ ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. రాష్ట్ర స్థాయిలో ఎవరూ సాధించని విధంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కలిపి 380 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. కుంగిపోకూడదు లక్ష్యసాధనలో ఓటములు ఎదురయ్యాయని కుంగిపోతే కలల్ని సాకారం చేసుకోలేం. గ్రూపు పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ముఖ్యంగా ఓపిక, పట్టుదల, నిరీక్షించేతత్వం ఉండాలి. ఎన్ని గంటలపాటు చదివామని కాకుండా ఎంత అర్థం చేసుకుని చదివామనేదే ముఖ్యం. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు రోజుకు 7 నుంచి 8 గంటలపాటు చదివా. పాఠ్యాంశాలపై తోటివారితో చర్చిస్తూ సిద్ధం కావటం ద్వారా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఎక్కువ పుస్తకాలను చదవటం కంటే కూడా చదివిన దాన్ని పునశ్ఛరణ చేసుకోవటం మంచిది. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే వారు వదంతుల్ని నమ్మకూడదు. పోటీని తట్టుకునే స్థాయిలో నైపుణ్యాలు సాధిస్తే విజయం మనదే. సమాజాభివృద్ధిలో భాగస్వామిని కావాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నించా. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవటంలో 'ఈనాడు' దినపత్రిక, గ్రంథాలయాలు ఎంతో సహకారాన్ని అందించాయి. ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించేందుకు పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తలుపు తట్టడం ఖాయం. * కచ్చితమైన సమయపాలనతోనే అన్నీ సబ్జెక్టులను చదివాను. చదవడం ప్రారంభించిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ ఒకే విధంగా చదివాను. ప్రభుత్వ కొలువు పొందాలన్న ఆశావాదం మరింత ప్రోత్సాహం ఇచ్చింది. * ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండా ప్రభుత్వ ప్రచురణ పుస్తకాలు, మరికొన్ని గుర్తింపు పొందిన పుస్తకాలను బాగా చదివాను. ది హిందూ, ఈనాడు పత్రికలు బాగా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఎకానమీకి సంబంధించిన అంశాలను క్రమం తప్పాకుండా అప్డేట్ చేసుకోవడం వల్ల మంచి స్కోరింగ్ వచ్చింది. ఈనాడు ప్రతిభలో ప్రచురితమయ్యే కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడింది. డిప్యూటీ తహశిల్దార్ పోస్టుకే నా ప్రథమ ప్రాధాన్యం. * నోమన్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్యూలో గతనెల్లో మన రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గెలవడానికి గల కారణాలు, రాజీవ్ యువకిరణాలు, దేశంలో అవినీతికి గల కారణాలు - నిర్మూలనకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పాను. ఆర్థికపరంగా, వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. వారి సహాకారంతోనే నేను విజయం సాధించగలిగాను. |
సమయ పాలన, స్వీయ ప్రేరణతోనే విజయం
|
|
గ్రూప్-2 ఉమెన్ టాపర్: జయలక్ష్మీ పద్మజ
పట్టుదల ఉంటే సాధించలేనది ఏదిలేదని నిరూపించారు ప్రకాశం జిల్లాకు చెందిన గ్రూప్-2 టాపర్ జయలక్ష్మీ పద్మజ. అందరూ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. కొందరే విజయం సాధిస్తారు. దీనికి కారణం వారు అనుసరించిన విధానమే. సరైన సమయంలో సరైన పంథాలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్లిన వారు విజయాన్ని సొంతం చేసుకుంటారు. జయలక్ష్మీ పద్మజ కూడా ఇదే కోవకు చెందుతారు. ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల్లో 356 మార్కులతో టాపర్గా నిలిచిన ఆమె సక్సెస్ విశేషాలను 'న్యూస్టుడే'కు వివరించారు. ప్రశ్న: మీ విద్యార్హతలేమిటి? జ: నేను ఎంఎస్సీ, ఎంఫిల్ పూర్తిచేశాను. ప్ర: గ్రూప్-2కే ఎందుకు సిద్ధమయ్యారు? ఇతర ఉద్యోగాలు చాలా ఉన్నాయి కదా? జ: ఆసక్తే అందుకు కారణం. ప్రారంభంలో బ్యాంకు ఉద్యోగం చేయాలనుకున్నా అంతగా ఆసక్తి కనబరచలేకపోయాను. గ్రూప్స్ మీద ఆసక్తితో 2008లో గ్రూప్ -2 దరఖాస్తు చేశాను. పద్ధతిగా పరీక్షలు రాయడంతో కమర్షియల్ టాక్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. ప్ర: టాపర్గా మీ స్పందన ఏమిటి? జ: ఈ సారి గ్రూప్-2 పరీక్షల్లో మంచి ర్యాంక్ వస్తుందనుకున్నాను. కానీ ప్రథమస్థానం గురించి ఆలోచించలేదు. ప్రథమ స్థానం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్ర: పరీక్షలకు ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రత్యేకించి ఏదైనా ప్రిపరేషన్ విధానాన్ని అనుసరించారా? జ: ఏ పరీక్షలో విజయం అందుకోవాలన్నా సమయపాలన, స్వీయ ప్రేరణ (సెల్ఫ్ మోటివేషన్) చాలా అవసరం. గ్రూప్-2కు సిద్ధమయ్యే ప్రక్రియలో భాగంగా హైదరాబాద్లోని ఆర్సీరెడ్డి స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నాను. ఇది నా విజయానికి ఎంతగానో బాటలు వేసింది. కోచింగ్ తీసుకున్నంత మాత్రానా సక్సెస్ వస్తుందనుకోవడం సరికాదని నా అభిప్రాయం. నా వరకు నేను పరీక్షకు సంబంధించిన పలు రిఫరెన్స్ పుస్తకాలు చదివాను. పరీక్ష ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో సమయ పాలన నిర్దేశించుకున్నాను. ప్రతిరోజూ ఏంచేయాలో ముందుగానే ప్లాన్ చేసుకుని దాని ప్రకారం నడుచుకున్నాను. ప్ర: మీ విజయానికి ప్రధాన కారణాలేమిటి? జ: సిలబస్ను వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయడం, స్వయం ప్రేరణే నా విజయానికి ప్రధాన కారణాలు. కష్టపడే తత్వం, చేసే పనిని బట్టే ఫలితం ఆధారపడి ఉంటుందనే నమ్మకమే నన్ను గెలిచేలా చేశాయి. ప్ర: మీ కుంటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంది? జ: ముఖ్యంగా నా భర్త ప్రోత్సాహం మరువలేనిది. సహచర మిత్రులు, తెలిసిన వారు అందరూ నన్ను ప్రోత్సహించారు. ప్ర. ఏ పోస్టులకు మీరు ప్రాధాన్యం ఇచ్చారు? జ: గ్రూప్ 2 విభాగాల్లో 'ఏసీటీవో' పోస్టును ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకున్నాను. ప్ర: ఇంటర్వ్యూకు ఎలా సిద్ధపడ్డారు?ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు? జ: ఇంటర్వ్యూకు సంబంధించి భవానీ శంకర్ గైడెన్స్ చాలా బాగా ఉపయోగపడింది. ఇంటర్వ్యూలో టాక్సేషన్ పై ఎక్కువ ప్రశ్నలు అడిగారు. అన్నీ రకాల టాక్స్లు, వ్యాట్లు, సేవా పన్నులపై ప్రశ్నలు అడిగారు. ఇంకా కేరళ - తమిళనాడు ముళ్ల పెరియార్ డ్యాం వివాదం, ట్రావెన్ కోర్ దేవస్థానం లాంటి వాటిపై ప్రశ్నలు అడిగారు. ప్ర: కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి మీరిచ్చే సూచనలు...? జ: అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటే కోచింగ్లో ఇచ్చిన సలహాలను, సూచనలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. నోట్స్ రాసుకోవాలి. సమయాన్ని ఎక్కడా వృధా చేయకుండా పక్కా ప్రణాళికతో పరీక్షలకు సిద్ధపడితే విజయం తప్పక వరిస్తుంది. |
|
నిరంతర కృషే విజయానికి మార్గం |
|
గ్రూప్-2 ఉమెన్ సెకండ్ టాపర్: మునగల రాజ్యలక్ష్మి |
|
నిరుత్సాహ పడకూడదు, పట్టుదలతో చదవాలి |
|
* గ్రూప్-2 ఉమెన్ సెకండ్ టాపర్ కోసూరు రాజ్యలక్ష్మి |
|
పోటీ పరీక్షల్లో పట్టుదలతో చదివిన వారికి విజయం సొంతం అవుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళలకు తరచూ నిరుత్సాహ పూరిత వాతావరణం ఎదురవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మొక్కవోని దీక్షతో లక్ష్యం సాధించాలనే తపనతో కృషిచేసిన వారికి విజయం తలొంచక తప్పదు. ఈ కోవకు చెందిన వారే కోసూరు రాజ్యలక్ష్మి. |
|
VRO/VRA - 2012 |
|
భోజనం.. నిద్ర లేవు
* శిష్టు చిట్టిబాబు (వీఆర్ఓ ఫస్ట్ ర్యాంక్)
వీరఘట్టం: శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం అని చెప్పారు. అకస్మాత్తుగా దాన్ని ఇచ్చాపురానికి మార్చారు. మా గ్రామం నుంచి ఏడుగంటల ప్రయాణం. అందుకే ముందురోజు బయల్దేరి అష్టకష్టాలు పడి ఇచ్ఛాపురం చేరుకున్నా. ఆ రాత్రి భోజనం లేదు.. కంటిమీద కునుకు లేదు.. రాత్రంతార దోమల బాధ. తెల్లారితే పరీక్ష. స్నానం, టిఫిన్ ఏమీ లేవు. ఎలాగైతేనేం పరీక్ష రాశా. రాష్ట్రస్థాయిలోనే ప్రథముడిగా నిలిచా. ఇపుడు చాలా ఆనందంగా ఉంది.
|
![]() |
* వీఆర్వో పరీక్షల్లో రాష్ట్రస్థాయిలోనే ప్రథముడిగా నిలిచిన శిష్టు చిట్టిబాబు చెప్పిన మాటలివి. ఇతనిది వీరఘట్టం మండలం తలవరం గ్రామం. తన ప్రతిభ ద్వారా కన్నవారికి ఉన్న ఊరికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. చిట్టిబాబుది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. 1 నుంచి 10వ తరగతి వరకు స్వగ్రామం తలవరంలోనే పూర్తయింది. ఇంటర్మీడియెట్ వీరఘట్టం, డిగ్రీ అనకాపల్లి, ఎంఎస్సీ ఉస్మానియా యూనివర్సిటీ, బీఈడీ నంద్యాల్లో పూర్తిచేశారు. తల్లిదండ్రులు విశ్వేశ్వరరావు, అచ్చన్నమ్మలు పెద్దగా చదువుకోలేదు. అయినా తమ ఏకైక కుమారుడు చిట్టిబాబును నిరంతరం ప్రోత్సహిస్తూ వచ్చారు. అతను ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి పంపించారు. కుటుంబసభ్యులైన డి.వేణు కృష్ణమూర్తి, శ్రీనివాసరావు, కె.గీత, కె.మురళీమోహన్, సరస్వతి ఆర్థికంగా ఆదుకున్నారు. పూర్వానుభవమే విజయానికి కారణం. వీఆర్వో పరీక్షలకు చిట్టిబాబు ప్రత్యేకంగా తర్ఫీదు పొందలేదు. ఇందుకోసం ప్రత్యేక సమయాన్నీ కేటాయించలేదు. గతంలో గ్రూప్-2, డీఏవో పరీక్షలకు రెండేళ్లపాటు హైదరాబాద్లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో విజయం సాధించలేకపోయాడు. ఆ అనుభవంతోనే వీఆర్వోపరీక్షలు రాశారు. డీఏవో పరీక్షలో అర్ధమేటిక్, రీజినింగు అంశాలు వీఆర్వో పరీక్షలో అక్కరకొచ్చాయి. ఈ విభాగంలో 38 మార్కులు సాధించారు. గ్రూప్-2లో తర్ఫీదు పొందిన జనరల్ స్టడీస్ ఈ పరీక్షలో బాగా ఉపయోగపడింది. ఈ విభాగంలో 55 మార్కులు సాధించగలిగారు. మొత్తం 93 మార్కులతో రాష్ట్రంలోనే ప్రథముడిగా నిలిచారు.గ్రూప్-2లో విజయం సాధించి ఉపతహశిల్దారు కావాలన్నదే ఇప్పటికి తన లక్ష్యమని చిట్టిబాబు చెబుతున్నారు. ష్యమని చిట్టిబాబు చెబుతున్నారు. |
విద్యావలంటీరు సాధించిన విజయం |
నారాయణపురం(మందస): మందస మండలంలోని నారాయణపురం పంచాయతీ మల్లేనవారిపేటకు చెందిన మల్లేన నాగేశ్వరరావు వీఆర్వో నియామక పరీక్షలో 3వ ర్యాంకు సాధించారు. 1 నుంచి 10వ తరగతి వరకు హరిపురం, బాలిగాం ప్రభుత్వ పాఠశాలల్లో, ఇంటర్ శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో చదివిన నాగేశ్వరరావు డిగ్రీ (బీఎస్సీ గణితం) పలాస ప్రజ్ఞ కళాశాలలో పూర్తి చేశారు. ఉన్నత చదువులకు ఆర్థిక పరిస్థితులు సహకరించక నాగేశ్వరరావు గ్రామంలోని పాఠశాలలో విద్యా వలంటీరుగా పని చేస్తూ తాజాగా వీఆర్వో పరీక్షకు హాజరయ్యారు. ఎలాగైనా ఉద్యోగం పొందాలన్న పట్టుదలతో శిక్షణ తీసుకొని పరీక్షరాశారు. |
'మొదట్నుంచీ వీఆర్వో పరీక్షలో విజయం సాధిస్తానన్న నమ్మకముంది.. అదిలా సాకారమైనందుకు చాలా సంతోషంగా ఉంద'ని నాగేశ్వరరావు 'న్యూస్టుడే'తో సంతోషాన్ని పంచుకున్నారు. 100కు 87 మార్కులు సాధించిన నాగేశ్వరరావు 'నా జీవిత లక్ష్యం.. సివిల్స్. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నాక.. ఆ లక్ష్య సాధనకు కృషి చేస్తా ' అన్నారు. వీఆర్వో పరీక్షకు ఆరో తరగతి నుంచి టెన్త్ వరకూ పాఠ్య పుస్తకాలు, కరెంట్ అఫైర్స్కు విజేత కాంపిటీషన్స్ పుస్తకాలు, పత్రికలు చదివా.. అని వివరించారు. |
లక్ష్యం దిశగా ముందడుగు |
* రాజేష్ కుమార్ ( వీఆర్ఓ రెండోర్యాంకు) సింగుపురం(రామలక్ష్మణకూడలి): గ్రూప్స్ లక్ష్యంగా ప్రయత్నించిన రాజేష్కుమార్ వీఆర్ఓ పరీక్షలో జిల్లా స్థాయిలో ద్వితీయ ర్యాంకును కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలనుకునే వాళ్లున్న ఈ రోజుల్లో ఎయిర్ ఫోర్సులో ఉద్యోగం వచ్చినా వదిలేసి... గ్రూప్స్ను లక్ష్యంగా చేసుకొని సాధన చేపట్టారు. వీఆర్ఓ పరీక్ష ఫలితాల్లో జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచారు. శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని సింగుపురం కొత్త దేవాంగుల వీధికి చెందిన రాజేష్ వీఆర్వో పరీక్షలో 87 మార్కులు సాధించాడు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాజేష్ బీఎస్సీ బీఈడీ చదువుకున్నారు. |
![]() |
పదోతరగతి వరకు సింగుపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివి 414 మార్కులు సాధించాడు. మునసబుపేట గాయత్రీ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదువును పూర్తి చేశాడు. చదువు కొనసాగుతుండగానే మధ్యలో 2001లో ఎయిర్ ఫోర్సు ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగించి, వారికి సేవ చేసేందుకు అవకాశం ఉన్న కొలువే కావాలనుకొని తన ఉద్యోగానికి రాజీనామాచేశాడు. అనంతరం బీఈడీ చదువు పూర్తి చేశాడు. అనంతరం గ్రూప్స్కు సాధన మొదలుపెట్టి.. 2008లో గ్రూప్-2 రాసిన రాజేష్ కుమార్కు నిరాశే ఎదురయింది. గ్రూప్-4లో తొమ్మిదో స్థానంలో నిలిచినా.. అప్పుడు ఓపెన్లో మూడింటినే తీయడంతో అవకాశం రాలేదు. ఒక సారి చేతికొచ్చిన అవకాశం వదిలేసి.. రెండు సార్లు నిరాశ ఎదురైన రాజేషకుమార్కు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా తన లక్ష్యం వైపు ముందుకు సాగారు. దీంతో తాజాగా నిర్వహించిన వీఆర్ఓ పరీక్షకు హాజరై సత్తాచాటారు. |
లక్ష్యం గ్రూప్-2 * వీఆర్వో రాష్ట్ర రెండో ర్యాంకర్ వీరబాబు |
కోదాడ: భవిష్యత్తులో గ్రూప్-2 సాధించడమే లక్ష్యమని నల్గొండ జిల్లా చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామానికి చెందిన వీరబాబు అన్నారు. వీఆర్వో పరీక్షలో 92 మార్కులు సాధించి రెండో ర్యాంకర్గా నిలిచిన ఈయన ప్రస్తుతం కోదాడలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీఎస్) 3 వ సంవత్సరం చదువుతున్నారు. టాప్ 10 లో ఉండొచ్చని ఊహించాననీ టాప్ - 2 లోనే స్థానం లభించడం నిజంగా ఆనందాన్ని కలిగిస్తోందని వీరబాబు 'న్యూస్టుడే' విలేకరికి తెలిపారు. వాగ్దేవి విద్యా సంస్థల ఛైర్మన్ వెంకటరెడ్డి, తన బాబాయి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ర్యాంక్ అందుకోగలిగినట్లు చెప్పారు. |
గ్రూప్ 2 సాధిస్తా... * వీఆర్వో 8వ ర్యాంకర్ ఏమిరెడ్డి రాజేందర్రెడ్డి |
గుర్రంపోడు: గ్రూప్ 2 సాధించడమే లక్ష్యం. మాది కనగల్ మండలం ఏమిరెడ్డిగూడెం. గ్రూప్2 కు సాధన చేస్తూ వీఆర్వో ఉద్యోగానికి పరీక్షలు రాశాను. అన్న ఎలేందర్రెడ్డి, తమ్ముడు ఉపేందర్రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులే. నేను కూడా గ్రూప్2 ద్వారా ఉన్నత ఉద్యోగం సాధించాలని భావిస్తున్నా. తండ్రి మోహన్రెడ్డి సాధారణ రైతు. తల్లి లలితమ్మ గృహిణి. డిగ్రీ వరకు నల్గొండలో, పీజీ హైదరాబాదులో పూర్తి చేశాను. |
![]() |