ఇంజినీరింగ్
జాతీయ స్థాయిలోనో, రాష్ట్ర స్థాయిలోనో జరిగిన పరీక్షలకు హాజరు కాలేకపోయినా, ఆ పరీక్షల్లో సరైన ర్యాంకులు రాకపోవడంతో తమకు ఇష్టమైన ఇంజినీరింగ్ చేసే అవకాశాన్ని కోల్పోయినా, అభ్యర్థులు ఆవేదన చెందాల్సిన అవసరంలేదు. రెగ్యులర్ ఇంజినీరింగ్కి సమానమైన పట్టాను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. వీటితో ఉన్నత చదువులకు వెళ్లొచ్చు. ఉద్యోగాలు సంపాదించవచ్చు. పదోన్నతులు కూడా అందుకోవచ్చు.
|