పీల్చే గాలిలో పెరుగుతున్న సీసం
పీల్చే గాలి మనిషి ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేసేలా మారుతోంది. దుమ్ము, ధూళిలో పెరిగిపోతున్న భారలోహాలు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో పిల్లలు, గర్భవతులపై చేసిన ఓ అధ్యయనంలో రక్తంలో సీసం పరిమాణం మోతాదుకు కన్నా ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలోని చాలా నగరాల్లో ఇదే తరహా పరిస్థితి ఉందని వైద్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రక్తంలో సీసం పరిమాణం పెరిగితే రక్తంలోని ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నం చెందడం ద్వారా తీవ్రమైన రక్తహీనత సమస్యకు దారితీస్తుంది. ఆరు వేల సంవత్సరాల కిందట కనుగొన్న సీసాన్ని ప్రస్తుతం మనం నిత్యజీవితంలో వినియోగిస్తున్న అనేక రకాల పరికరాల్లో వాడుతున్నారు.