ప్రతి అంశాన్ని శ్రద్ధగా చదవాలి
ప్రతి అంశాన్ని శ్రద్ధగా చదువడమే తన విజయ రహస్యమని ఎంపీసీ గ్రూప్తో రాష్ట్రంలో 5వ ర్యాంకు సాధించిన వి.మౌనిక అన్నారు. తన విజయానికి తెలుగు అకాడమీ పుస్తకాలు ఎంతగానో తోడ్పడ్డాయని కూడా చెప్పారు. ఈమె సూర్యపేట త్రివేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. అదే విద్యా సంస్థల్లో 9, 10 తరగతులను పూర్తిచేశారు. ఈమెకు పదో తరగతిలో 563 మార్కులు వచ్చాయి. ఇంటర్ ఎంపీసీలో 991 మార్కులు సాధించారు.
ఇంటర్లో వచ్చిన మార్కులు
ఆంగ్లం 98, సంస్కృతం 98, గణితం- 1లో 75, గణితం- 2లో 75, భౌతికశాస్త్రం 60, రసాయనశాస్త్రం 60. ఆంగ్లం, సంస్కృతంలో రెండేసి మార్కులు తగ్గాయి.
పేదరికం అడ్డుకాలేదు
మౌనిక తల్లిదండ్రులు చిన్నపాటి బియ్యం వ్యాపారం చేసుకుంటూ సూర్యపేటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, పేదరికం కారణంగా త్రివేణి పాఠశాల యాజమాన్యం ఆమెను 9వ తరగతి నుంచే ఉచితంగా చదివించింది.