దిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష 2021లో జనవరికి బదులు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబరులో ప్రారంభయ్యే అవకాశం ఉంది.
ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్!
Posted Date : 24-11-2020 .