భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్(ఏఎస్ఆర్బీ) 2021 సంవత్సరానికి గాను నెట్, ఏఆర్ఎస్(ప్రిలిమినరీ), ఎస్టీఓల సంయుక్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు..
1) నేషనల్ ఎలిజిబిటీ టెస్ట్ (నెట్)
* రాష్ట్రానికి సంబంధించిన లేదా ఇతర అగ్రికల్చరల్ యూనివర్సిటీల్లో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు అర్హతకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.
అర్హత: 19.09.2021 నాటికి సంబంధిత విభాగాలు, స్పెషలైజైషన్లలో మాస్టర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 01.01.2021 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్)కి గరిష్ఠ వయసు లేదు. ప్రయత్నాల సంఖ్య కూడా అపరిమితం(ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు).
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: దీనిలో ఒక పేపర్ ఉంటుంది. దీన్ని 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1మార్కు చొప్పున 150 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండు గంటలు ఉంటుంది. దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.
2) అగ్రికల్చరల్ రిసెర్చ్ సర్వీసెస్-ప్రిలిమినరీ ఎగ్జామ్ (ఏఆర్ఎస్)
* ఏఆర్ఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్, వైవా వాయిస్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులను ఐకార్లో సైంటిస్ట్లుగా తీసుకుంటారు.
* మొత్తం ఖాళీలు: 222
అర్హత: సంబంధిత విభాగంలోని స్పెషలైజేషన్తో మాస్టర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 01.01.2021 నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రయత్నాల సంఖ్య 6 (అన్రిజర్వ్డ్ కేటగిరి), ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 9.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా(ప్రిలిమ్స్), మెయిన్స్, వైవా-వాయిస్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఏఆర్ఎస్-2021 (ప్రిలిమినరీ) పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది. దీన్ని 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండు గంటలు ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన వారిని మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇది 240 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటలు. దీనిలో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను వైవా వాయిస్కి ఎంపిక చేస్తారు.
3) సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఎస్టీఓ)
* దీని ద్వారా ఐకార్ హెడ్ క్వార్టర్స్, ఇతర పరిశోధనా సంస్థల్లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.
* మొత్తం ఖాళీలు: 65
అర్హత: 19.09.2021 నాటికి సంబంధిత స్పెషలైజేషన్లలో మాస్టర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 25.04.2021 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను 150 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ రూపంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండు గంటలు ఉంటుంది. ఈ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.04.2021.
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 25.04.2021.
* ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేది: 25.04.2021.
* నెట్-2021/ ఏఆర్ఎస్ (ప్రిలిమినరీ)-2021/ ఎస్టీఓ పరీక్ష తేదీలు: 2021 జూన్ 21 నుంచి 27 వరకు.
* ఏఆర్ఎస్-2021 (మెయిన్స్) పరీక్ష తేది: 19.09.2021.
టీహెచ్ఎస్టీఐ-సీడీఎస్లో ఎస్ఆర్ఎఫ్ పోస్టులు
సీఎస్ఐఆర్-ఐఎంఎంటీలో సైంటిస్టులు
ఎన్ఐఎంఆర్లో కన్సల్టెంట్, ఇతర పోస్టులు
ఎస్ఈసీఎల్లో మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
సీఎస్ఎంసీఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఐహెచ్బీటీ, పాలంపూర్లో ప్రాజెక్ట్ స్టాఫ్
బీఈసీఐఎల్-463 వివిధ ఖాళీలు
డీహెచ్ఆర్లో వివిధ ఖాళీలు
ఎన్సీఎల్-మధ్యప్రదేశ్లో మెడికల్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
వీఈసీసీ-కోల్కతాలో ఖాళీలు
సాయ్లో మసూర్ ఖాళీలు
సాయ్లో యంగ్ ప్రొఫెషనల్స్
ఎన్ఆర్టీఐ-వడోదరలో నాన్ టీచింగ్ పోస్టులు
ఎన్ఏఎల్-బెంగళూరులో వివిధ ఖాళీలు
రాయలసీమ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
మహానది కోల్ఫీల్డ్స్లో మెడికల్ పోస్టులు
బీఐఎస్ఏజీ(ఎన్)లో జేఆర్ఎఫ్ ఖాళీలు
మిధానీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 511 పోస్టులు
కృష్ణా జిల్లాలో 200 గ్రామ/ వార్డ్ వాలంటీర్లు